News October 27, 2024

జన్వాడ రేవ్‌ పార్టీలో KTR బామ్మర్ది

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ ఫామ్‌హౌస్ యజమాని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలగా పోలీసులు గుర్తించారు. పార్టీ కూడా అతడే నిర్వహించినట్లు నిర్ధారించారు. మొత్తం 35 మంది యువతీయువకులు పార్టీలో పాల్గొనగా విజయ్ మద్దూరి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. దీంతో రాజ్ పాకాలపై చేవెళ్ల ఎక్సైజ్ పీఎస్‌లో 34ఏ, 34(1), రెడ్‌విత్ 9 ఎక్సైజ్ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

Similar News

News January 26, 2026

తెలుగు రాష్ట్రాల్లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు

image

తెలుగు రాష్ట్రాల లోక్‌భ‌వన్‌లలో ‘ఎట్ హోం’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ‌AP గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ సహా కీలక నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఇటు TGలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో Dy.CM భట్టి సహా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఎక్స‌లెన్స్ అవార్డులు ఇచ్చారు.

News January 26, 2026

గోళ్లు విరిగిపోతున్నాయా?

image

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్​కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్​ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.

News January 26, 2026

T20 WCలో పాక్ ఆడుతుందా? సీన్‌లోకి ఆ దేశ ప్రధాని..

image

T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడుతుందా.. లేదా.. అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. దీనిపై ఈరోజు PCB ఛైర్మన్ నఖ్వీ తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ‘బాయ్‌కాట్’ ఆలోచన ఇంకా తమ పరిశీలనలోనే ఉందని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం వచ్చే శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే టీమ్‌ను ప్రకటించగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పాక్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.