News October 27, 2024
క్రాకర్స్ కాల్చేవారికి పోలీసుల షాక్
TG: హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 55 డెసిబెల్స్కు మించి శబ్దం చేసే క్రాకర్స్ కాల్చొద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News October 27, 2024
పవన్ కళ్యాణ్తో సినీ నటుడు పార్థిబన్ భేటీ
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్థిబన్ దాదాపు 70కిపైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
News October 27, 2024
దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు: జగన్
AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.
News October 27, 2024
పాకిస్థాన్ కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్
పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ను పీసీబీ నియమించింది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా, జింబాబ్వే సిరీస్లో ఆయన జట్టుకు సారథ్యం వహిస్తారు. సల్మాన్ అలీ అఘాను వైస్ కెప్టెన్గా నియమించింది. టెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్సీ చేస్తున్నారు. కాగా వన్డే, టీ20 కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ ఇటీవల గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.