News October 27, 2024
MVA తీరుపై అఖిలేశ్ అసంతృప్తి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహావికాస్ అఘాడీ కూటమి తీరుపై SP చీఫ్ అఖిలేశ్ కినుక వహించారు. తమకు సీట్ల కేటాయింపులో కూటమి పార్టీలు జాప్యం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. SP పోటీ చేయాలని భావిస్తున్న ధులె సీటుకు శివసేన UBT అభ్యర్థిని ప్రకటించడాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబు అజ్మీ తప్పుబట్టారు. 5 సీట్లు ఇవ్వకపోతే 20 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.
Similar News
News October 27, 2024
టీ20 మైండ్సెట్ నుంచి రోహిత్ బయటికి రావాలి: మంజ్రేకర్
స్వదేశంలో భారత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ను లైనప్లో కిందకి నెట్టి, వాషింగ్టన్ సుందర్ను ముందు పంపడం వంటి వ్యూహాలు అర్థరహితంగా అనిపించాయి. బ్యాటింగ్లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అనేది టీ20 వ్యూహం. రోహిత్ ఆ మైండ్సెట్ నుంచి బయటపడాలి’ అని సూచించారు.
News October 27, 2024
పవన్ కళ్యాణ్తో సినీ నటుడు పార్థిబన్ భేటీ
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్థిబన్ దాదాపు 70కిపైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
News October 27, 2024
దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు: జగన్
AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.