News October 27, 2024

దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే?

image

శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చింది, అలాగే నరకాసురుడిని సత్యభామ చంపింది ఒకే రోజు. ఈ రోజునే దీపావళిగా జరుపుకుంటారని ప్రతీతి. అప్పటినుంచి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఈసారి అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల మధ్య లక్ష్మీపూజ సమయమని పండితులు చెబుతున్నారు.

Similar News

News October 27, 2024

ఫాంహౌస్ పార్టీ.. DGPకి కేసీఆర్ ఫోన్

image

TG: జన్వాడ <<14465898>>ఫాంహౌస్<<>> పార్టీపై BRS అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర విల్లాల్లో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు. కాగా, కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

News October 27, 2024

సింగిల్స్‌కు ఫ్రీ వాటర్ బాటిల్స్.. ఎందుకంటే?

image

పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఢిల్లీ కన్సర్ట్‌ మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. కన్సర్ట్‌లో సింగిల్స్‌కు ఓ మ్యాట్రిమొనీ వాలంటీర్లు ‘సింగిల్స్ కో పానీ పిలావో యోజన’ పేరుతో ఫ్రీ వాటర్ బాటిల్స్ అందించారు. ‘మా మ్యాట్రిమొనీలో చేరి ఉంటే ఈ బాటిల్‌కు బదులుగా మీ భాగస్వామి చేతులు పట్టుకుని ఉండేవారు’ అని ప్రమోషన్స్ చేశారు. ఫ్రీ బాటిల్స్ అందుకున్న సింగిల్స్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.

News October 27, 2024

BREAKING: కదులుతున్న రైలులో మంటలు!

image

మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైలులో మంటలు అలజడి సృష్టించాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకారు. ఈ ఘటన రత్లాం సమీపంలోని ప్రీతమ్ నగర్, రునియా రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.