News October 27, 2024

విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే: షర్మిల

image

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగినవారే అని PCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ మాటలే ఆయన మాట్లాడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘విజయసాయి గారూ, మీరు చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తులు నలుగురు బిడ్డలకు చెందాలని YS నిర్ణయించారు. కాదని ఆయన చెప్పగలరా? ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఈ వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News October 27, 2024

అత్యుత్తమ టెస్టు జట్టులో రోహిత్ ఓపెనర్‌గా ఉంటారు: స్మిత్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆటగాళ్లతో అత్యుత్తమ టెస్టు జట్టును తయారుచేస్తే దానికి ఓపెనర్‌గా తాను రోహిత్‌నే ఎంచుకుంటానని తెలిపారు. ‘రోహిత్ చాలా ప్రమాదకర ప్లేయర్. నిర్భయంగా తన షాట్స్ ఆడతారు. అవసరమైతే అద్భుతంగా డిఫెండ్ కూడా చేసుకోగలరు. అతడు క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు’ అని పేర్కొన్నారు.

News October 27, 2024

IASలకు పోస్టింగ్స్.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి

image

AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది.
*టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
*వైద్యారోగ్యశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ
*జీఏడీలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్
*కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్
**మరో ఐఏఎస్ రొనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.

News October 27, 2024

ఇజ్రాయెల్‌కు మన పవర్ చూపాలి: ఖమేనీ

image

ఇజ్రాయెల్‌కు తమ సత్తా ఏంటో చూపాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారులను ఆదేశించినట్లు IRNA తెలిపింది. ‘మనపై జరిగిన దాడులను తక్కువ చేసి చూడొద్దు. ఎక్కువగానూ భావించొద్దు. దేశానికి మేలు జరిగే అనువైన మార్గాన్ని అధికారులే నిర్ణయించాలి’ అని ఆయన వారితో చెప్పినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌పై శక్తివంతమైన దాడి చేశామని, తమ లక్ష్యాలను పూర్తిగా సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.