News October 27, 2024

ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోన్న కాంగ్రెస్: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్‌ను నమ్మి అన్ని వర్గాలు మోసపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఆరు గ్యారంటీలు, 400 హామీలను ఎలా అమలు చేస్తుంది? పెన్షన్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి గురించి సర్కార్ ఆలోచించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూసీ బాధితుల కోసం కరసేవ చేసేందుకు మేం సిద్ధం’ అని ఆయన ప్రకటించారు.

Similar News

News October 27, 2024

కేసులకు భయపడం: కేటీఆర్

image

TG: తమను రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబసభ్యులు, బంధువుల మీద కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 11 నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో తాము కేసులకు భయపడబోమని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం తరఫున ఒక్కరూ మాట్లాడట్లేదని విమర్శించారు.

News October 27, 2024

భారత్ ఓటమి

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డివైన్(79), సుజీ బేట్స్(58) రాణించడంతో 259 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ టాపార్డర్ విఫలమవ్వడంతో 183 పరుగులకే ఆలౌటైంది. జట్టులో రాధా యాదవ్(48) టాప్ స్కోరర్. NZ విజయంతో సిరీస్ సమమైంది. కాగా సిరీస్ విజేతను నిర్ధారించే మూడో వన్డే 29న జరగనుంది.

News October 27, 2024

సంచలనంగా జన్వాడ ఫాంహౌస్ పార్టీ!

image

తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫాంహౌస్ పార్టీ సంచలనంగా మారింది. KTR బావమరిది పాకాల రాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు KTRను టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఫాంహౌస్‌లో డ్రగ్స్ లభించలేదని, పర్మిషన్ లేని లిక్కర్ వాడినంత మాత్రాన కేసులేంటని BRS కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీ అంటున్నారు.