News October 27, 2024

ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన ఉంగుటూరులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నూజివీడుకి చెందిన భవాని భర్త అనారోగ్యంతో పెద్దఔటుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడిని చూసేందుకు భవానితో పాటు పద్మకుమారి ఆదివారం ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా వారిని ఓ బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News November 6, 2025

మచిలీపట్నం: ఎన్నికల చట్టాలు, నిబంధనలపై వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్రంలోని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అవనిగడ్డ, పామర్రు, పెడన, గన్నవరం నియోజకవర్గాల రెవెన్యూ శాఖేతర అధికారులుగా డీఎస్‌వో, డీఎం పౌరసరఫరాల సంస్థ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ముడా వీసీలు ఓటర్ల నమోదు అధికారులుగా ఉంటారన్నారు.

News November 6, 2025

కృష్ణా: ఇకపై విజన్ యూనిట్‌లుగా సచివాలయాలు

image

గ్రామ/వార్డు సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్‌లుగా మారనున్నాయి. సచివాలయాల పేర్లు మారుస్తున్నట్లు గురువారం జరిగిన మంత్రులు, HODలు, సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ విజన్ యూనిట్‌లుగా పని చేయనున్నాయి.

News November 6, 2025

మాక్ అసెంబ్లీకి కృష్ణా జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం 7 నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సభా వ్యవహారాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని DEO వివరించారు.