News October 27, 2024
బీజేపీకి ప్రజల భద్రత కంటే పబ్లిసిటీయే ముఖ్యం: రాహుల్ గాంధీ
దేశంలో మౌలిక వసతుల కల్పనలో బీజేపీ సర్కారు విఫలమైందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విటర్లో ఆరోపించారు. ‘భారత్లో మౌలిక వసతుల కల్పన దారుణంగా దిగజారింది. ముంబై రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట అందుకో ఉదాహరణ. గత ఏడాది బాలాసోర్ రైలు ప్రమాదంలో 300మంది చనిపోయారు. ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే కూలిపోయింది. BJPకి కావాల్సింది పబ్లిసిటీ మాత్రమే తప్ప ప్రజల భద్రత కాదు’ అని విమర్శించారు.
Similar News
News October 28, 2024
GOSSIP: నానీతో లోకేశ్ కనగరాజ్ సినిమా?
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో టాలీవుడ్ హీరో నాని ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ టాలీవుడ్ సర్కిల్స్లో ఓ గాసిప్ నడుస్తోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో బ్లాక్బస్టర్స్ కొట్టిన లోకేశ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్లో ఒకరిగా ఉన్నారు. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే.. ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో ఒకటిగా ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
News October 28, 2024
సుమతీ నీతి పద్యం.. తాత్పర్యం
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!
తాత్పర్యం: భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరతాయి. అలాగే మూర్ఖుడు, పిసినారి దాచిన సంపద రాజులపాలవుతుంది. అతనికి ఏమాత్రం ఉపయోగపడదు.
News October 28, 2024
అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు
✒ 1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
✒ 1886: అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహావిష్కరణ
✒ 1900: జర్మనీ భాషావేత్త మాక్స్ ముల్లర్ మరణం
✒ 1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
✒ 1918: స్వతంత్ర దేశంగా చెకోస్లోవేకియా ఆవిర్భావం
✒ 1924: తెలుగు సినీనటి సూర్యకాంతం జననం