News October 28, 2024
SKLM: ఈ నెల 31న జిల్లాకు రానున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 31వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్లు ఆదివారం తెలిపారు. గురువారం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేటలో ప్రారంభించనున్నారు. CM పర్యటన సభాస్థలిని పరిశీలించేందుకు MLA బెందాళం అశోక్, ఇన్ఛార్జి RDO కృష్ణమూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News January 21, 2026
వినతులు స్వీకరించిన అచ్చెన్న

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడాలని పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు సిఫారసు చేశారు.
News January 21, 2026
కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. ఎక్కడి వాళ్లు చేశారంటే!

కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కే.వీ మహేశ్వర రెడ్డి వివరాలు వెల్లడించారు. ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
News January 21, 2026
SKLM: రెండో రోజు హెలికాఫ్టర్ రైడ్లో ఎంత మంది విహరించారంటే?

రథసప్తమి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్ను శ్రీకాకుళం వాసులు ఆస్వాదిస్తున్నారు. మంగళవారం రెండో రోజు దాదాపు 174 మంది హెలికాఫ్టర్లో విహరించగా రూ.3,82,400 వసూలయ్యాయి. రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చిన్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. రూ.2,200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.


