News October 28, 2024
JDUలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ తండ్రి
క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. బిహార్లో అధికార పార్టీ జేడీయూలో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలో కండువా కప్పుకున్నారు. సీఎం నితీశ్ కుమార్ తనకు ఆదర్శమని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు. కాగా గతంలో ఆయన ఇదే పార్టీలోనే ఉండేవారు. అయితే కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దడం కోసం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు.
Similar News
News October 28, 2024
హైదరాబాద్లో నెల రోజులపాటు ఆంక్షలు
TG: హైదరాబాద్లో నవంబర్ 28 వరకు నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పలు సంస్థలు, పార్టీలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని సమాచారం రావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని, ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు.
News October 28, 2024
ఏపీలో సీప్లేన్ సర్వీసులు.. డిసెంబర్ 9న ప్రారంభం
ఏపీలో సీప్లేన్ సర్వీసులను డిసెంబర్ 9న ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తొలుత ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాలను ఒకే రోజు అతి తక్కువ ఖర్చుతో దర్శించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
News October 28, 2024
HYDRA అప్రూవ్డ్ ఇళ్లు లభించును.. బిల్డర్ల ప్రకటనలు
TG: HYDలో హైడ్రా అధికారులు ఏ భవనాన్ని ఎప్పుడు కూలుస్తారోననే భయంతో కొత్త ఇళ్లు కొనేందుకు జనం జంకుతున్నారు. దీంతో ‘మా వద్ద హైడ్రా అప్రూవ్డ్ ఇళ్లు ఉన్నాయి. మా ప్రాజెక్టులో ఇళ్లు కొనండి’ అని బిల్డర్లు ప్రకటనలు చేస్తున్నారు. అటు FTL, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భవనాలను కూల్చివేస్తుండటం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. డౌన్పేమెంట్ కట్టిన వారూ డెవలపర్లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు.