News October 28, 2024
70 ఏళ్లు పైబడిన వారికి రేపు ఆయుష్మాన్ భారత్ ప్రారంభం

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన(AB-PMJAY)ను రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధిపొందుతారు. 29వేలకు పైగా ఆస్పత్రుల్లో సేవలు లభిస్తాయి. అర్హులైనవారు PMJAY పోర్టల్ లేదా ఆయుష్మాన్ భారత్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News January 13, 2026
స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్

ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్మెంట్ కేసును విజయవాడ ACB కోర్టు మూసివేసింది. CID నివేదికకు ఆమోదం తెలుపుతూ CM చంద్రబాబు సహా 37 మందిపై విచారణను క్లోజ్ చేసింది. ‘మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్’గా నిందితులందరికీ విముక్తి కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అటు తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలన్న స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి ఛైర్మన్ కె.అజయ్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించింది.
News January 13, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలి రోజు ప్రీమియర్స్తో కలిపి ఇండియాలో రూ.37.10 కోట్లు వసూలు చేసినట్లు ‘sacnilk’ పేర్కొంది. ఇందులో సోమవారం రూ.28.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ప్రీమియర్ షోల ద్వారా రూ.8.6 కోట్లు రాబట్టింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్, పండుగ సీజన్తో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
News January 13, 2026
తక్కువ ఖర్చుతో పంటకు రక్ష, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్ర పురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


