News October 28, 2024

NOV 6న క్యాబినెట్ భేటీ.. పూర్తిస్థాయి బడ్జెట్‌పై నిర్ణయం?

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 6న క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించేందుకు ప్రతిపాదనలను నవంబర్ 4వ తేదీ సా.4 గంటలలోపు పంపాలని అన్ని శాఖలను CS నీరబ్ ఆదేశించారు. ఈ భేటీలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్‌తో ముగియనుంది.

Similar News

News October 28, 2024

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.490, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.450 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.79,800కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,150గా నమోదైంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ ధర రూ.1,07,000గా ఉంది.

News October 28, 2024

జనగణనకు సిద్ధమైన కేంద్రం?

image

2025 నుంచి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి, 2028 నాటికి ముగించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

News October 28, 2024

కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా?

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల మేర కరెంట్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ దీనికి ఈఆర్సీ అనుమతిస్తే నవంబర్ 1 నుంచి ప్రజలపై(300యూనిట్లకు పైగా వాడేవారు) ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.