News October 28, 2024
ఒక్క DAపై ఉద్యోగుల్లో అసంతృప్తి
TG: పెండింగ్లో ఉన్న 5 DAల్లో ఒక్కటి మాత్రమే ప్రభుత్వం ఇస్తామని చెప్పడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది తమను నిరాశకు గురిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం లైట్ తీసుకుందని, సంఘాలు సైతం పోరాడలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Similar News
News October 28, 2024
గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.490, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.450 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.79,800కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,150గా నమోదైంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ ధర రూ.1,07,000గా ఉంది.
News October 28, 2024
జనగణనకు సిద్ధమైన కేంద్రం?
2025 నుంచి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం లోక్సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి, 2028 నాటికి ముగించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.
News October 28, 2024
కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా?
TG: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల మేర కరెంట్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ దీనికి ఈఆర్సీ అనుమతిస్తే నవంబర్ 1 నుంచి ప్రజలపై(300యూనిట్లకు పైగా వాడేవారు) ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.