News October 28, 2024
టెస్లా CFOతో మంత్రి లోకేశ్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
ఏపీలో పెట్టుబడులపై టెస్లా CFO వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. USలోని ఆస్టిన్లో ఉన్న టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 72GW రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తే తమ లక్ష్యమని, దీనికి టెస్లా వంటి గ్లోబల్ కంపెనీ సహాయ, సహకారాలు అవసరమని పేర్కొన్నారు.
Similar News
News October 28, 2024
హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల
TG: జన్వాడ ఫామ్హౌస్ పార్టీకి సంబంధించిన కేసులో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి పోలీసులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
News October 28, 2024
నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు: నయన్
తాను ఫేస్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘నేను ఎక్కువగా ఐబ్రోస్ చేయించుకోవడాన్ని ఇష్టపడతా. కొన్నేళ్లుగా నా ఐబ్రోస్లో మార్పులు వస్తుండటంతో నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నానని కొందరు భావించి ఉండొచ్చు’ అని ఆమె అన్నారు.
News October 28, 2024
అసెంబ్లీలో పీఏసీ సమావేశం.. బహిష్కరించిన BRS
TG: అసెంబ్లీలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష BRS పీఏసీ ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం తెలిపింది. ఈ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించింది. BRS నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన BRS నుంచి కాంగ్రెస్లో చేరడంతో కారు పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.