News October 28, 2024
మహబూబ్నగర్: భార్య, అత్తపై వేటకొడవలితో దాడి

మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో భార్య, అత్తపై అల్లుడు దాడి చేసిన విషయం తెలిసిందే. SI ప్రకారం.. లక్ష్మమ్మ-కుర్మన్న దంపతులు. కాగా, భార్యపై అనుమానంతో కుర్మన్న గొడవ పడి వెళ్లిపోయాడు. కుమార్తె ఒంటరిగా ఉండటంతో తల్లి నిర్మలమ్మ వచ్చింది. నిర్మలమ్మ కుర్మన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. మళ్లీ వీరి మధ్య గొడవ జరగగా.. లక్ష్మమ్మపై, అడ్డు వచ్చిన నిర్మలమ్మపై వేటకొడవలితో దాడి చేసి పారిపోయాడు. కేసు నమోదైంది.
Similar News
News December 25, 2025
MBNR: ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్తా సమీపంలో నారాయణపేట జిల్లా మరికల్ స్కూల్ బస్సు అదుపుతప్పి కింద పడ్డ సంఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి.జానకి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎస్సై లెనిన్ ప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News December 24, 2025
MBNR: పీయూలో అథ్లెటిక్స్ ఎంపికలు ప్రారంభం

పాలమూరు విశ్వవిద్యాలయంలోని సింథటిక్ మైదానంలో దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ (మహిళల) జట్టు ఎంపికలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ హాజరై క్రీడలను ప్రారంభించారు. వర్సిటీలో అత్యాధునిక సింథటిక్ ట్రాక్ అందుబాటులో ఉండటం క్రీడాకారులకు వరం లాంటిదన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
News December 23, 2025
పాలమూరు యూనివర్సిటీలో అథ్లెటిక్స్ సెలక్షన్స్

ఏఐయూ టోర్నమెంట్ల కోసం జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో అథ్లెటిక్స్ (పురుషులు) సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించారు. ఎంపికైన వారు జనవరి 12-16 వరకు బెంగళూరులో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారు. ఈనెల 24న అథ్లెటిక్స్ ఉమెన్స్, 29న ఉమెన్స్ క్రికెట్ సెలక్షన్లు ఉంటాయని ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసులు తెలిపారు.


