News October 28, 2024

టపాసుల వ్యాపారం.. తుస్సు.. తుస్సు..

image

AP: మరి కొద్ది రోజుల్లో దీపావళి పండుగ. కానీ బాణసంచా మార్కెట్‌లో సందడి లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్‌లో 70-80% వరకు అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 25శాతం వ్యాపారం కూడా జరగలేదని విజయవాడలో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రతి ఇంట్లో చెప్పుకోలేనంత నష్టం జరిగింది. దీనికి తోడు పెరిగిన నిత్యావసర ధరలతో టపాసుల కొనడంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిందంటున్నారు వ్యాపారులు.

Similar News

News February 19, 2026

యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్!

image

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్ తగిలింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్ చేస్తే జీరోగా కనిపిస్తోంది. ఫీడ్ కూడా మాయం అయింది. కాగా హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైంది. అన్వేష్ ఇన్‌స్టాను బ్లాక్ చేయాలని హైదరాబాద్ CCS పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

News February 19, 2026

పాక్‌లో పేలుడు.. 16 మంది మృతి

image

పాకిస్థాన్‌ కరాచీలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పటివరకు 16 మంది మరణించారని, మరో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా కరాచీలో గతేడాది కూడా ఐదంతస్తుల భవనం కూలడంతో 27 మంది మరణించారు.

News February 19, 2026

తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

image

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్‌లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్‌ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.