News October 28, 2024
పవన్ కళ్యాణ్ ఆఫీసులో లేపాక్షి బొమ్మల ఎగ్జిబిషన్ స్టాల్

AP: లేపాక్షి బొమ్మలపై ఇష్టంతో డిప్యూటీ సీఎం పవన్ తన క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి బొమ్మల శాశ్వత ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేయించారు. వీటితో పాటు సవర తెగకు చెందిన గిరిజనులు ఎంతో ఇష్టంతో పంపించిన బహుమతులను అందుకుని ఆయన సంతోషించారని Dy.CM కార్యాలయం ట్వీట్ చేసింది. అలాగే తన పుట్టినరోజు సమయంలో వారు చేసిన కార్యక్రమాలు, వేడుకలను గురించి తెలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారని ఫొటోలు పోస్ట్ చేసింది.
Similar News
News March 1, 2026
కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN

AP: అమరావతిలో నేషనల్ జుడీషియల్ అకాడమీని నెలకొల్పాలని CM చంద్రబాబు CJIని కోరారు. ’మధ్యవర్తిత్వం‘పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ‘ఇక్కడ నిర్మించే జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్గా తీర్చిదిద్దుతాం. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే ₹10,000 ఇస్తాం. కేసులు పరిష్కారం కాకున్నా ₹3000 ఇస్తాం’ అని పేర్కొన్నారు. అంతకు ముందు జడ్జీల బంగ్లాలను CJI ప్రారంభించారు. AP జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.
News March 1, 2026
BREAKING: US యుద్ధనౌకపై 4 మిస్సైళ్లతో ఇరాన్ దాడి

యుద్ధ విమానాలను తరలిస్తున్న అమెరికా నౌక అబ్రహం లింకన్పై ఇరాన్ దాడి చేసింది. 4 బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే యుద్ధ విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ బేస్లకు వాటిని తరలిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్పై US దాడులు మరింతగా పెంచే ఆస్కారముంది.
News March 1, 2026
సీఎం రేవంత్కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

TG: సీఎం రేవంత్పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు CMకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.


