News October 28, 2024

ఆ 3 పోర్టులు ప్రైవేట్ పరం?: YCP

image

AP: రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారని YCP ట్వీట్ చేసింది. ‘మూడు పోర్టులను జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలోనే చేపట్టారు. ఇప్పుడు పోర్టులు పూర్తవుతున్న దశలో వాటిని ఆపాలని కమీషన్ల కోసం కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబు’ అని పేర్కొంది.

Similar News

News February 4, 2026

కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదు: KTR

image

TG: మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ <<19051424>>వాడిన<<>> భాషను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. హార్వర్డ్‌లో ఎన్ని కోర్సులు చేసినా రేవంత్ తన భాషను మార్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన KCR వంటి నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజవదంటూ మండిపడ్డారు.

News February 4, 2026

వార్మప్ మ్యాచ్.. SAకి భారీ టార్గెట్

image

సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20WC వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(53), తిలక్ వర్మ(45), అక్షర్ పటేల్(35), సూర్యకుమార్(30), పాండ్య(30) రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్, కోర్బిన్, అన్‌రిచ్, మఫాకలు తలో వికెట్ తీశారు. విజయం కోసం SA బ్యాటర్లు 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి.

News February 4, 2026

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్: CM

image

AP: నెట్ జీరో కాన్సెప్టుతో అన్ని వనరులను సమగ్రంగా వినియోగించుకొని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను ముందుకు తీసుకెళ్లాలని CM CBN ఆదేశించారు. బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చే పథకాలకు రూపకల్పన చేయాలని బీసీ వెల్ఫేర్ సమీక్షలో సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు యోచిస్తున్నామన్నారు. ఆదరణ-3 ద్వారా కుల వృత్తుల వారీగా ఆధునిక పనిముట్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.