News October 28, 2024

చైతూ-శోభితపై కామెంట్స్ చేసిన వేణుస్వామికి షాక్

image

నాగచైతన్య – శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి TG హైకోర్టు షాక్ ఇచ్చింది. వారంలోగా ఈ కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని గతంలో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈక్రమంలో ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది.

Similar News

News October 28, 2024

డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు CCTV ఫుటేజీనీ ఎత్తుకెళ్లారు!

image

ఓ బ్యాంకును లూటీ చేసిన దొంగ‌ల ముఠా డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు అక్క‌డి CCTV ఫుటేజ్‌ని కూడా ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. న్యామ‌తి టౌన్‌లోని SBI ACB నెహ్రూ రోడ్ బ్రాంచ్‌లో కిటికీలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి చోరీకి పాల్ప‌డిన ముఠా లాక‌ర్ల‌లోని డ‌బ్బు, బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే పోలీసుల‌కు త‌మ ఆన‌వాళ్లు ల‌భించ‌కూడ‌ద‌ని CCTV ఫుటేజ్‌ని సైతం ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 28, 2024

ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఫంక్షన్‌లో తారల సందడి

image

ANR జాతీయ అవార్డు ఫంక్షన్‌లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అఖిల్ హాజరయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌తో పాటు సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం హాజరయ్యారు.

News October 28, 2024

ఉచిత సిలిండర్ పథకం.. కీలక అప్డేట్

image

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల జాయింట్ అకౌంట్‌కు రూ.895 కోట్లు రిలీజ్ చేసింది. పట్టణ ప్రజలకు 24 గంటల్లో, గ్రామీణ ప్రజలకు 48 గంటల్లో DBT ద్వారా డబ్బులు జమచేయనుంది. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వనుంది. కాగా ఈ నెల 31 నుంచి ఈ పథకం అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.