News October 28, 2024
ఆర్థిక అనిశ్చితి కారణంగానే చైనా మెత్తబడింది: పరిశీలకులు

ఇతర దేశాలతో నిత్యం కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు బాగా వెనక్కి తగ్గింది. ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండటమే దీనికి కారణమని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ‘చైనా ఆర్థిక పరిస్థితి దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత ఘోరంగా ఉంది. ప్రొవిన్షియల్ ప్రభుత్వాలు దివాలా తీశాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఈ ఒత్తిడే ఆ దేశ విదేశీ విధానాల్లో మార్పును తీసుకొచ్చింది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
పెరగనున్న చలి.. ఇవాళ్టి నుంచి జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నిన్న TGలోని ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ్టి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో కనిష్ఠంగా 9-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. అటు APలోని విశాఖ, మన్యం జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
News November 11, 2025
CSKకి సంజూ శాంసన్ ఎందుకు?

సంజూ శాంసన్ CSKలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే జడేజాను RRకు పంపి శాంసన్ను తీసుకోవడంలో చెన్నై జట్టుకు భవిష్యత్ ప్రయోజనాలున్నాయని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ధోనీ తర్వాత సారథిగా సంజూ బెటర్ అని యాజమాన్యం భావించినట్లు పేర్కొంటున్నాయి. కీపింగ్, స్ట్రాంగ్ బ్యాటర్ కోటాను ఫుల్ఫిల్ చేస్తారనే ట్రేడ్కు చెన్నై ఆసక్తి చూపినట్లు వివరిస్తున్నాయి. గతంలో జడేజాకు CSK కెప్టెన్సీ ఇవ్వగా ఫెయిలైన విషయం తెలిసిందే.
News November 11, 2025
‘రిచా’ పేరిట స్టేడియం

WWC విన్నర్ రిచా ఘోష్కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.


