News October 28, 2024
నాలుగు నెలల్లో రూ.47 వేల కోట్ల అప్పు: పేర్ని నాని
AP: సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై రూ.6.072 కోట్ల కరెంటు ఛార్జీల భారం మోపారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఇసుక బంగారంతో సమానంగా మారిందని అన్నారు.
Similar News
News October 28, 2024
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ భాగస్వామి RAILOFY రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దూర ప్రయాణాలలో దీని ద్వారా పలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా +917441111266 నంబర్కు వాట్సాప్లో Hi అని మెసేజ్ చేయాలి. నచ్చిన భాషను ఎంచుకొని వివరాలతో పాటు డెలివరీ స్టేషన్ ఎంచుకోవాలి. సమీపంలో రెస్టారెంట్ను సెలక్ట్ చేసి ఆర్డర్ చేస్తే సీటు వద్దకే ఫుడ్ డెలివరీ చేస్తారు.
News October 28, 2024
మా అమ్మ ఏఎన్నార్కు వీరాభిమాని: చిరంజీవి
నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు తన తల్లి అంజనా దేవి వీరాభిమాని అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఏఎన్నార్ ఫ్యాన్స్లో సీనియర్ ఫ్యాన్ మా అమ్మ. నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమా విడుదలైంది. అమ్మ నిండు గర్భిణిగా ఉన్నా తన బలవంతం మీద నాన్న జట్కా బండిలో సినిమాకు తీసుకెళ్లారు. దారిలో బండి తిరగబడినా సినిమా చూశాకే తిరిగి ఇంటికి వచ్చారు. ఏఎన్నార్ అంటే అమ్మకు అంత పిచ్చి ఉండేది’ అని వెల్లడించారు.
News October 28, 2024
కుటుంబంలో చీలిక తెచ్చారు.. శరద్ పవార్పై అజిత్ ఫైర్
బారామతిలో తనకు వ్యతిరేకంగా మరొకరిని పోటీకి దింపి శరద్ పవార్ కుటుంబంలో చీలిక తెచ్చారని Dy.CM అజిత్ పవార్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి తన భార్యను పోటీకి దింపి తప్పు చేసినట్టు అంగీకరించానని, అయితే ఇప్పుడు ఇతరులు కూడా తప్పు చేస్తున్నట్టు కనబడుతోందన్నారు. అజిత్ సోమవారం నామినేషన్ వేశారు. అజిత్కు వ్యతిరేకంగా మనవడు యుగేంద్రను శరద్ పవార్ రంగంలోకి దింపారు.