News October 28, 2024

మరో ఐదుగురు జర్నలిస్టులు మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలు సంస్థలకు చెందిన మ‌రో ఐదుగురు జ‌ర్న‌లిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు త‌మ‌ను భ‌య‌పెట్ట‌లేవ‌ని, ఇజ్రాయెల్ నిరంకుశ‌త్వాన్ని వెలికితీయ‌కుండా జ‌ర్న‌లిస్టుల‌ను నిలువ‌రించ‌లేవ‌ని గాజాలోని ప్ర‌భుత్వ‌ మీడియా ఆఫీస్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల‌పై అంత‌ర్జాతీయ స‌మాజం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఇప్ప‌టిదాకా 176 మంది జ‌ర్న‌లిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News October 28, 2024

మా అమ్మ ఏఎన్నార్‌కు వీరాభిమాని: చిరంజీవి

image

నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు తన తల్లి అంజనా దేవి వీరాభిమాని అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఏఎన్నార్ ఫ్యాన్స్‌లో సీనియర్ ఫ్యాన్ మా అమ్మ. నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమా విడుదలైంది. అమ్మ నిండు గర్భిణిగా ఉన్నా తన బలవంతం మీద నాన్న జట్కా బండిలో సినిమాకు తీసుకెళ్లారు. దారిలో బండి తిరగబడినా సినిమా చూశాకే తిరిగి ఇంటికి వచ్చారు. ఏఎన్నార్ అంటే అమ్మకు అంత పిచ్చి ఉండేది’ అని వెల్లడించారు.

News October 28, 2024

కుటుంబంలో చీలిక తెచ్చారు.. శరద్ పవార్‌పై అజిత్‌ ఫైర్

image

బారామ‌తిలో త‌న‌కు వ్య‌తిరేకంగా మ‌రొక‌రిని పోటీకి దింపి శ‌ర‌ద్ ప‌వార్ కుటుంబంలో చీలిక తెచ్చార‌ని Dy.CM అజిత్ ప‌వార్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నిక‌ల్లో బారామ‌తి నుంచి త‌న భార్య‌ను పోటీకి దింపి త‌ప్పు చేసినట్టు అంగీక‌రించాన‌ని, అయితే ఇప్పుడు ఇత‌రులు కూడా త‌ప్పు చేస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంద‌న్నారు. అజిత్ సోమవారం నామినేషన్ వేశారు. అజిత్‌కు వ్య‌తిరేకంగా మ‌న‌వ‌డు యుగేంద్రను శ‌ర‌ద్ ప‌వార్‌ రంగంలోకి దింపారు.

News October 28, 2024

వారిని గద్దె దింపేందుకు ఐక్యంగా పనిచేద్దాం: అఖిలేశ్ యాదవ్

image

మహారాష్ట్రలో మహాయుతి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు స‌మ‌ష్టి వ్యూహాన్ని ర‌చించ‌డానికి ఐక్యంగా ప‌నిచేయాల‌ని MVA మిత్ర‌ప‌క్షాల‌కు SP చీఫ్ అఖిలేశ్ యాద‌వ్‌ సూచించారు. బీజేపీ, అజిత్ ప‌వార్‌, షిండేల‌ను రాష్ట్ర శ‌త్రువులుగా అభివర్ణించారు. వీరిని ఓడించి సానుకూల మార్పు తీసుకొస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌లు మ‌త‌త‌త్వ, వెన్నుపోటు రాజ‌కీయాల నుంచి MHకు విముక్తి క‌ల్పిస్తాయ‌ని పోస్ట్ చేశారు.