News October 28, 2024

‘KCR సూచించిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా నియమించాలి’

image

BRS అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని PAC ఛైర్మన్ ‌గా KCR నియమించారని మాజీ మంత్రి, MLA వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కేసీ వేణుగోపాల్ పీఏసీ ఛైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని కోరారు. KCR సూచించిన వారిని పీఏసీ ఛైర్మన్ ‌గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News March 11, 2025

నిజామాబాద్: TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన స్వస్థలం కోటగిరి మండలం సిద్దులం. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సిరిసిల్లలోని ఓ భవనంలో ఆయన లిఫ్ట్ యాక్సిడెంట్‌కు గురై మృతి చెందారని బెటాలియన్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2025

నిజామాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

మెండోరా మండలం వెల్గటూర్‌కు చంద్రగిరి వెంకటేశ్(39) ఆర్థిక నష్టాలతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ నారాయణ తెలిపారు. వెంకటేష్ ఉపాధి కోసం మూడు సార్లు దుబాయ్ వెళ్లొచ్చాడని చెప్పారు. వెల్గటూర్ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడన్నారు. భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News March 11, 2025

NZB: కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్: కవిత

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ సర్కారు మనిషికి 2.5లక్షల అప్పులు చేసిందని ఆరోపించారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

error: Content is protected !!