News October 28, 2024
రాష్ట్రాన్ని ప్రైవేట్ పరం చేయనున్న చంద్రబాబు: కాకాణి

రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగిస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని రామాయపట్నం, మచిలీపట్నం పోర్టును కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిధులు లేవని సాకు చెబుతూ సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.
Similar News
News March 1, 2026
ఆన్లైన్లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా: నెల్లూరు డీఈవో

జిల్లాలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను http://deonellore.50webs.com/ ఆన్లైన్లో పొందుపరిచామని డీఈవో డా. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాల సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో రేపటి నుంచి 7వ తేదీ లోగా పని దినాలలో సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్లో అందజేయాలన్నారు.
News March 1, 2026
ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
News March 1, 2026
నెల్లూరు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఎస్పీ ఏమన్నారంటే.!

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారని చెప్పారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.


