News October 28, 2024

ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఫంక్షన్‌లో తారల సందడి

image

ANR జాతీయ అవార్డు ఫంక్షన్‌లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అఖిల్ హాజరయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌తో పాటు సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం హాజరయ్యారు.

Similar News

News October 29, 2024

భారత్ ఓటమిపై పాక్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు

image

న్యూజిలాండ్‌ చేతిలో భారత జట్టు ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా ప్లేయర్ల అతివిశ్వాసం వల్లే టెస్టు సిరీస్‌ను కోల్పోయిందన్నారు. మొదటి టెస్టులో కివీస్ పేసర్లు, రెండో టెస్టులో స్పిన్నర్లు రాణించారని చెప్పారు. న్యూజిలాండ్‌ను తేలిగ్గా తీసుకోవడం వల్లే ఓటమి ఎదురైందన్నారు. BGTకి షమి లేకపోవడం భారత జట్టుకు సమస్యేనని పేర్కొన్నారు.

News October 29, 2024

కార్ కొంటున్నారా?.. వీటిపై లక్షకుపైగా డిస్కౌంట్

image

అమ్మకాలు తగ్గడంతో కార్ల కంపెనీలు లక్షల్లో డిస్కౌంట్లు ప్రకటించాయి. పలు కార్ల తగ్గింపు ధరలు: మ‌హింద్రా థార్ (3 డోర్‌) ₹1.5 ల‌క్ష‌లు, XUV400 ₹3 లక్ష‌లు, కొన్ని XUV700 మోడల్స్ పై ₹2 ల‌క్ష‌లు *మారుతీ బాలెనో ₹1.1 లక్షలు *మారుతి గ్రాండ్ విటారా ₹1.1-1.4 లక్షలు *పాత మోడల్ స్కార్పియో ₹1.2 లక్షలు *Toyota Fortuner ₹2 లక్షలు *జీప్ కంపాస్ ₹2.5 లక్షలు *ఎంజి గ్లోస్టర్ ₹4.9 లక్షలు *BMW X5 ₹7-10 లక్షలు తగ్గింపు.

News October 29, 2024

కర్ణాటకలో పానీపూరీ ప్రియుల్లో ఆందోళన!

image

మంచూరియాన్‌లో ఆర్టిఫిషియ‌ల్ క‌ల‌ర్ల వాడ‌కంపై ఇప్ప‌టికే నిషేధం విధించిన క‌ర్ణాట‌క తాజాగా పానీపూరీల‌పై దృష్టిసారించింది. వీటి వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యానికి పొంచివున్న ముప్పుపై అధ్య‌య‌నం చేస్తోంది. బెంగ‌ళూరులో 200 సెంట‌ర్ల నుంచి శాంపిల్స్ సేక‌రించిన అధికారులు వాటిని ప‌రీక్ష‌ల‌కు పంపారు. వీటి తయారీలో అనేక విమర్శలు వస్తుండడంతో ప్రభుత్వం వీటిని బ్యాన్ చేస్తుందేమో అని పానీపూరీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.