News October 28, 2024

DANGER ALERT: పొద్దున, సాయంత్రం బయటకెళ్తున్నారా..

image

ఎయిర్ పొల్యూషన్‌తో పెద్దలకే కాదు యువతకూ ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పరిశోధకులు. గాల్లో పెరిగిన నైట్రోజన్ డైయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి అణువులతో లంగ్స్, హార్ట్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. హృదయ స్పందన, లయ దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందన్నారు. AP, TGలో AQI లెవల్స్ పెరుగుతుండటంతో పొద్దున, సాయంత్రం ఆఫీస్ పనిపై బయటకెళ్తున్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

Similar News

News February 1, 2026

కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

image

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.

News February 1, 2026

పోలవరానికి తగ్గిన నిధుల కేటాయింపు

image

AP: FY26-27 కేంద్ర బ‌డ్జెట్‌లో పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టుకు ₹3320 కోట్లు మాత్రమే కేటాయించారు. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో ₹5936 కోట్లు ఇచ్చారు. అయితే గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించినా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ₹3017 కోట్లు మాత్రమే వచ్చాయి. పోల‌వ‌రం వాట‌ర్ స్టోరేజి లెవ‌ల్‌ను 41.15 మీట‌ర్ల‌కు కుదించిన‌ట్లు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

News February 1, 2026

ఫోన్లు ట్యాప్ చేసి ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేశారు: TPCC చీఫ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR సిట్ విచారణ నేపథ్యంలో BRSపై TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో అనేకమంది CMలు విచారణ ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకొని బిల్డర్లు, సినీ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేశారని, వందలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారని ఆరోపించారు. KCR ఆదేశాలు లేకుండా ఇంతపెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగడం సాధ్యం కాదన్నారు.