News October 29, 2024
నేటి నుంచి బీబీనగర్ ఎయిమ్స్లో డ్రోన్ సేవలు

TG: BBనగర్ ఎయిమ్స్లో డ్రోన్ సేవలను ప్రధాని వర్చువల్గా నేడు ప్రారంభించనున్నారు. టీబీ అనుమానితులు పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో సేకరించిన శాంపిల్స్ ఆసుపత్రికి పంపేందుకు చాలా సమయం పడుతోంది. కాగా ఇక నుంచి PHCల్లో శాంపిల్స్ సేకరించి వాటిని డ్రోన్ సాయంతో జిల్లా కేంద్ర ఆసుపత్రులకు పంపించనున్నారు. మందులను కూడా డ్రోన్ల ద్వారా అందిస్తారు.
Similar News
News September 18, 2025
OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం

ఆన్లైన్ గేమింగ్కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <