News October 29, 2024

వరంగల్: రూ.50 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా కొత్తపత్తి ధర ఈరోజు రూ.6,800 పలకగా.. నేడు రూ.50 పెరిగి రూ.6,850కి చేరింది. కాగా, గత కొద్ది రోజులుగా పత్తి ధరలు భారీగా పడిపోతుండటంతో ఇటీవల రైతన్నలు మార్కెట్లో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.

Similar News

News November 4, 2025

వరంగల్: భారీగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,200 ధర పలకగా.. ఈరోజు రూ.17,800 అయింది. అలాగే, వండర్ హాట్ (WH) మిర్చికి రూ.15,500 ధర వస్తే.. నేడు రూ.16,200 అయింది. మరోవైపు, తేజ మిర్చి ధర నిన్న రూ.14,000 ధర ఉంటే.. మంగళవారం 15,100 అయింది.

News November 3, 2025

వైద్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ

image

వైద్య ఆరోగ్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలపై దిశా నిర్దేశం చేశారు. వైద్య సిబ్బంది గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించాలని, అలాగే మందుల నిల్వలపై ఆరా తీయాలని ఆయన సూచించారు.

News November 3, 2025

చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండాలి: మంత్రి వాకిటి

image

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 122 కోట్ల వ్యయంతో 83 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను 26 వేల నీటి వనరుల్లో నవంబర్ 20లోపు విడుదల చేయాలని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 6 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ సత్య శారద తెలియజేశారు.