News October 29, 2024

ప్రభుత్వం కబుర్లు చెబుతోంది: BRS

image

TG: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నడపాల్సిన పనిని మరిచిపోయి ప్రజలకు కబుర్లు చెప్పడంలో బిజీగా మారిందని ప్రతిపక్ష BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని, ఆయన అసమర్థత రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టింది. రెవెన్యూ టార్గెట్ రూ.2.74లక్షల కోట్లు కాగా 6 నెలల్లో కేవలం రూ.1.08లక్షల కోట్లు మాత్రమే సాధించినట్లు పేర్కొంది.

Similar News

News January 17, 2026

ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

image

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It

News January 17, 2026

DRDOలో JRF, RA పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ & స్టోర్స్ రీసెర్చ్& డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) 3 పోస్టులను భర్తీ చేయనుంది. PhD(కెమిస్ట్రీ), పీజీ, బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్, NET, GATE అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. RAకు స్టైపెండ్ నెలకు రూ.67వేలు, JRFకు 37వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in

News January 17, 2026

సౌదీ అరేబియాలో అరుదైన చిరుతల మమ్మీలు

image

నార్తర్న్ సౌదీ అరేబియాలోని గుహల్లో అరుదైన చిరుతల అవశేషాల(మమ్మీలు)ను అధికారులు గుర్తించారు. 130 నుంచి 1800ఏళ్ల మధ్య కాలం నాటివి అని రీసెర్చర్లు చెప్పారు. అరార్ సిటీకి సమీపంలో 54 చిరుతల ఎముకలతోపాటు ఏడు చీతా మమ్మీలను కనుగొన్నారు. క్లౌడీ కళ్లు, శరీర అవయవాలు ఎండిపోయినట్టు ఆ చిరుతల మృతదేహాలు ఉన్నాయి. ఎడారులు, హిమానీనదాలు, చిత్తడి నేలల్లో మమ్మిఫికేషన్ నేచురల్‌గా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.