News October 29, 2024
నాగిరెడ్డిపేట్: అనారోగ్యంతో ఉపాధ్యాయుడి మృతి

నాగిరెడ్డిపేట మండలం మాసంపల్లి గ్రామంలో యాదగిరి అనే ఉపాధ్యాయుడు అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. యాదగిరి నాలుగు నెలల క్రితం వెలువడిన గురుకుల పాఠశాల ఫలితాల్లో ఉద్యోగం సాధించి లింగంపేట మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో విధులు నిర్వహించాడని, ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో గణిత విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో గణిత టీచర్గా విధుల్లో చేరాడన్నారు.
Similar News
News December 31, 2025
NZB: నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి నేపథ్యమీదే!

నిజామాబాద్ నూతన కలెక్టర్గా నియమితులైన ఇలా త్రిపాఠి UP లక్నోకు చెందిన వారు. ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2013లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఎకనామిక్స్లో చదివారు. రెండో అటెంప్ట్ 2017లో సివిల్స్ సాధించారు. ఆమె భర్త భవేశ్ మిశ్రా కూడా IAS అధికారి. ఆమె ములుగులో పని చేసి టూరిజం డైరెక్టర్గా వెళ్లారు. తదుపరి నల్గొండ కలెక్టర్గా పని చేశారు.
News December 31, 2025
NZB: మందుబాబులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించేది లేదని ఫైన్, జైలు శిక్షకు గురికాక తప్పదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యూయర్ వేడుకల్లో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు నడిపిస్తే రూ.10 వేలకు మించిన ఫైన్తో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.
News December 31, 2025
NZB: మందుబాబులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించేది లేదని ఫైన్, జైలు శిక్షకు గురికాక తప్పదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యూయర్ వేడుకల్లో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు నడిపిస్తే రూ.10 వేలకు మించిన ఫైన్తో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.


