News October 29, 2024
విశాఖ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి బండి భేటీ

రోజ్ గార్ మేళాలో పాల్గొనేందుకు విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు నగరంలో పార్టీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్ తదితరులతో భేటీ అయ్యారు. నగరంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 19, 2025
విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’

విశాఖలో ఆపరేషన్ లంగ్స్లో భాగంగా గురు, శుక్రవారాల్లో 1053 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ లంగ్స్’ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. జోన్-1లో 40 ఆక్రమణలు, జోన్-2లో 86, జోన్ -3లో 71, జోన్-4లో 11, జోన్-5లో 58, జోన్-6లో 110, జోన్- 7లో 52, జోన్-8లో 40 ఆక్రమణలు తొలగించారు. శుక్రవారం ఒక్కరోజే 529 ఆక్రమణలు తొలగించారు.
News September 19, 2025
జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించిన మేయర్ బృందం

జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.
News September 19, 2025
దేవీ మండపాలకు సింగిల్ విండో అనుమతులు: విశాఖ సీపీ

విజయదశమి దేవీ మండపాల ఏర్పాటుకు https://durgautsav.net వెబ్ సైట్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ తెలిపారు. జీవీఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల సమన్వయంతో ఈ పోర్టల్ని ఏర్పాటు చేశామన్నారు. నిర్వాహకులు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి, వివరాలు నమోదు చేయాలని కోరారు. మండపాలకు క్యూఆర్ కోడ్ ఇస్తారని, దాన్ని మండపాలు వద్ద ప్రదర్శించాలని తెలిపారు.