News October 29, 2024
షర్మిలకు అన్యాయం జరిగింది: విజయమ్మ

AP: జగన్ CM అయ్యాక ఆస్తుల పంపకం ప్రపోజల్ పెట్టాడని తల్లి విజయమ్మ అన్నారు. ‘ఇప్పుడు ప్రచారంలో ఉన్న MOU జగన్ చేతితో రాసిందే. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు రూ.200Cr డివిడెండ్లు ఇచ్చారు. MOUలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, అందులో లేని యలహంక ప్రాపర్టీ 100% షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి సంతకం పెట్టాడు. కానీ అవి ఇవ్వలేదు. పైగా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో పాపకు అన్యాయం జరిగింది’ అని ఆవేదన చెందారు.
Similar News
News January 25, 2026
హృతిక్ రోషన్కు ఏమైంది?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిన్న చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ హుడీ, క్యాప్ ధరించిన ఆయన.. నడవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు.
News January 25, 2026
కోహ్లీకి ఆ సత్తా ఉందని సచిన్ చెప్పారు: రాజీవ్ శుక్లా

తన రికార్డులను కోహ్లీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని సచిన్ గతంలో తనతో చెప్పినట్లు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గుర్తు చేసుకున్నారు. ‘ఓ రోజు నేను సచిన్ ఇంటికి లంచ్కు వెళ్లాను. క్రికెట్లో మీరు చాలా రికార్డులు సృష్టించారని, వాటిని ఎవరు బ్రేక్ చేయగలరని సచిన్ను అడిగా. కోహ్లీకి ఆ సత్తా ఉందన్నారు’ అని రాజీవ్ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో సచిన్ 100 సెంచరీలు చేయగా, కోహ్లీ ఇప్పటి వరకు 85 శతకాలు బాదారు.
News January 25, 2026
FDDIలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని ఫుట్వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (<


