News October 30, 2024
MYSTERY: గాల్లోనే హైజాక్.. డబ్బుతో మాయం

అమెరికా చరిత్రలో నేటికీ పరిష్కృతం కాని మిస్టరీ ఇది. 1971, నవంబరు 24న నార్త్వెస్ట్ ఓరియెంట్ విమానంలో డాన్ కూపర్ అనే ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ను పిలిచి సూట్కేస్లో ఉన్న బాంబ్ చూపించాడు. 2 లక్షల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు. సియాటెల్లో ప్రయాణికుల్ని బయటికి వదిలేసి డబ్బులు తీసుకుని, నెవాడా వెళ్లాలని పైలట్లకు సూచించాడు. నెవాడా వెళ్లేసరికి డబ్బుతో మాయమయ్యాడు. అతడెవరన్నది నేటికీ అంతుచిక్కలేదు.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


