News October 30, 2024
ఆర్సీబీకి మళ్లీ కెప్టెన్ కానున్న కోహ్లీ?

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు మళ్లీ కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన జట్టు మేనేజ్మెంట్కు సమాచారమిచ్చినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 2022 నుంచి ఆ జట్టుకు డు ప్లెసిస్ కెప్టెన్సీ చేస్తున్నారు. కెప్టెన్లు మారుతున్నా కప్పు కొట్టడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో మరోసారి తానే కెప్టెన్గా కప్పుకోసం ట్రై చేయాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.
News January 12, 2026
పోలవరం-నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో TG ప్రభుత్వం పిటిషన్ను ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కాగా గోదావరి జలాల విషయంలో MH, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.
News January 12, 2026
ఇరాన్-USA: మైత్రి నుంచి మంటల వరకు..

షా మహమ్మద్ రెజా హయాంలో ఆయిల్-వెపన్స్ సేల్స్తో ఈ రెండూ ఫ్రెండ్లీ దేశాలు. రష్యాపై USA ఇక్కడి నుంచి నిఘా పెట్టేది. 1979లో ప్రజల తిరుగుబాటుతో షా USకు వెళ్లగా అప్పగింతకై నిరసనలు, US ఆస్తులపై దాడులు జరిగాయి. ఇస్లామిక్ ఉద్యమంతో మతపెద్ద అయతుల్లా పాలన, రిలేషన్ ఫాల్ మొదలయ్యాయి. 1980లో ఇరాన్-ఇరాక్ వార్లో USA ఇరాక్ వైపు ఉంది. 1989లో అలీ ఖమేనీకి పగ్గాలు, అణు పరీక్షలు, చైనాతో క్రూడ్ డీల్ గ్యాప్ పెంచాయి.


