News October 30, 2024

HYD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

image

యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలోని అబిద్‌నగర్‌లో ఇద్దరు నగరవాసులు మృతి చెందారు. సరదాగా 12 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులు HYD నుంచి స్నేహితుడి ఊరైన మూటకొండూరు మండలం అబిద్‌నగర్‌కు వెళ్లారు. ఆ ఊరిలోని చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు శశి, చరణ్ అనే విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బోడుప్పల్ వాసులుగా గుర్తించి కేసు నమోదు చేశారు.

Similar News

News January 14, 2026

మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

image

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.

News January 14, 2026

పతంగ్: Made In Dhoolpet

image

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్‌పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్‌ వైడ్‌ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్‌మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.

News January 14, 2026

పతంగ్: Made In Dhoolpet

image

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్‌పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్‌ వైడ్‌ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్‌మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.