News October 31, 2024

TTD బోర్డులో జనసేన కోటా నుంచి ముగ్గురికి చోటు

image

జనసేన కోటాలో టీటీడీ పాలకమండలిలో ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణకు చెందిన బొంగునూరి మహేందర్ రెడ్డి, పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆనంద్ సాయికి చోటు కల్పించారు. మహేందర్ రెడ్డి 2009 నుంచి యువరాజ్యంలో చురుగ్గా పని చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.

Similar News

News February 21, 2026

ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

image

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్‌ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.

News February 21, 2026

సోమవారం నిర్వహించే ‘విశేష పూజ’

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం రెండో గంట తర్వాత విశేష సేవ జరుగుతుంది. 14 కలశాలతో మలయప్ప స్వామికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. వీటిలో ఏడు కలశాలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి ద్రవ్యాలు, మిగిలిన ఏడింటిలో శుద్ధజలం ఉంటాయి. పంచసూక్తాల పఠనం మధ్య తిరుమంజనం జరుగుతుంది. హోమం, పూర్ణాహుతి తర్వాత భక్తులకు వస్త్ర బహుమానం ఇస్తారు. 1991లో ప్రారంభమైన ఈ సేవ లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్నారు.

News February 21, 2026

‘ఎర్రనల్లి’తో పుచ్చకు కలిగే నష్టం, నివారణకు సూచనలు

image

‘ఎర్రనల్లి’ పురుగులు ఎరుపు రంగులో ఉంటూ ఆకుల కింది భాగంలో సాలెగూడు లాగా ఏర్పరచుకొని రసం పీల్చుతాయి. దీని వల్ల ఆకుల పైభాగంలో పసుపు, గోధుమ రంగు మచ్చలతో ఆకులు కాలిపోయినట్లు కనిపిస్తాయి. వీటిని రైతులు తొలి దశలో త్వరగా గుర్తించలేరు. అందుకే ఎర్రనల్లితో ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగుల నివారణకు అబామెక్టిన్ 0.5ml (లేదా) స్పైరోమెసిఫెన్ 1ml లీటరు నీటికి కలిపి ఆకుల కింది భాగం తడిచేలా పిచికారీ చేయాలి.