News October 31, 2024
లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలంటే?

దీపావళి సందర్భంగా ఇళ్లలో, షాపుల్లో లక్ష్మీ పూజలు చేస్తుంటారు. అయితే, పూజ చేసేందుకు సరైన సమయాన్ని పురోహితులు సూచించారు. వేద పంచాంగం ప్రకారం ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం 5:36 నుంచి 8:11 వరకు, శుభ ముహూర్తం సాయంత్రం 5:31 నుంచి 9:55 గంటల వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:31-9:55 గంటల మధ్య లక్ష్మీపూజ చేయడం శుభప్రదమని వెల్లడించారు.
Similar News
News February 9, 2026
దీపారాధనలో ఎన్ని వత్తులు పెట్టాలి?

దీపారాధనలో వత్తుల సంఖ్యకు శాస్త్రపరంగా ప్రాముఖ్యత ఉంది. నిత్య దీపారాధనలో ఏకవత్తి పెట్టకూడదు. ఒకే వత్తిని అశుభ సమయాల్లో మాత్రమే వాడతారు. సామాన్యంగా ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కనీసం 2 వత్తులు కలిపి వేయడం శుభప్రదం. దీనిని ‘దంపతి వత్తి’ అని కూడా అంటారు. రెండుకు మించి ఇంకా ఎన్ని వత్తులైనా పెట్టవచ్చు. అందుకు ఎలాంటి నియమాలు లేవు. 108 వత్తుల దీపం వెలిగిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం.
News February 9, 2026
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News February 9, 2026
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


