News October 31, 2024
ఈ స్వీట్ కేజీ ధర రూ.56,000

లక్నోలోని ‘ఛప్పన్ భోగ్’ షాపులో అమ్మే ‘ఎక్సోటికా’ స్వీట్ ఇండియాలోనే ఖరీదైన మిఠాయిగా గుర్తింపు పొందింది. కేజీ ధర రూ.56,000. అఫ్గాన్ నుంచి పిస్తా, తుర్కియే నుంచి హాజెల్ నట్స్, ఇరాన్ నుంచి మమ్రా బాదం, అమెరికా నుంచి బ్లూబెర్రీస్, సౌతాఫ్రికా నుంచి మకాడమియా గింజలను దిగుమతి చేసుకుంటారు. కొన్ని గ్రాముల బంగారాన్ని సైతం మిక్స్ చేసి స్వీట్ తయారు చేస్తారు. కేజీ బాక్సులో 10 గ్రా. బరువున్న 100 ముక్కలు ఉంటాయి.
Similar News
News February 12, 2026
VZM: తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు

శివరాత్రికి రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం, సంగమేశ్వర స్వామి ఆలయం, పాల్తేరు, కోటిపల్లి, తదితర శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు గతం కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. తొక్కిసలాట జరగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రవేట్ ఆలయాలకు సంబంధించి ఆలయ కమిటీలను అప్రమత్తం చేయాలన్నారు.
News February 12, 2026
టెన్త్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు!

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేషన్ చేస్తుండగా, ఇకపై ప్రైవేటు టీచర్లకూ అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి 25% మంది ప్రైవేటు టీచర్లను తీసుకోనుంది. ఆన్లైన్ విధానంలో ఇన్విజిలేషన్ బాధ్యతలు కేటాయించనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 4 నుంచి 10 రోజులు జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది.
News February 12, 2026
కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా?

కళ్లజోడు ముఖానికి సరిపోదనో, కళ్ల రంగు మారిస్తే ఫ్యాషన్ అనో చాలామంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాడటంలో అజాగ్రత్తగా ఉన్నా కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి స్టైల్తో పాటు ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.


