News October 31, 2024
తిరుపతి ఎస్పీ ఆధ్వర్యంలో జాతీయ ఏక్తా దినోత్సవం

జాతీయ ఏక్తా దినోత్సవం సందర్భంగా నగరంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వరకు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ ర్యాలీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ గొప్పదనాన్ని ఎస్పీ తెలిపారు.
Similar News
News May 8, 2025
మంత్రి లోకేశ్తో ఎమ్మెల్యే థామస్ భేటీ

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
News May 7, 2025
28న చిత్తూరులో జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
News May 7, 2025
సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.