News October 31, 2024
Stock Market: మళ్లీ నష్టాలు

దీపావళికి ముందు ఐటీ రంగ షేర్లు 3 శాతం పతనమవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలబాట పట్టాయి. సెన్సెక్స్ 553 పాయింట్ల నష్టంతో 79,389 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతో 24,205 వద్ద స్థిరపడ్డాయి. Tech Mahindra, HCL Technologies, Infosys, TCS, Wipro భారీగా నష్టపోయాయి. బేర్ మార్కెట్లోనూ Cipla, L&T, Dr Reddy’s Labs, Hero Motocorp, ONGC లాభపడ్డాయి.
Similar News
News January 25, 2026
APPLY: టెన్త్ అర్హతతో 572 పోస్టులు

RBIలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో 36 పోస్టులున్నాయి. టెన్త్ పాసైన వారు అర్హులు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: rbi.org.in
News January 25, 2026
ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి: CS

AP: ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఓటు హక్కు వినియోగమే పునాది అని సీఎస్ విజయానంద్ చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘18 ఏళ్లు నిండిన వారు JAN 1, APR 1, JULY 1, OCT 1న ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. Form-8 ద్వారా చిరునామాను మార్చుకోవచ్చు. EPIC కార్డ్ ఉండటం వల్ల ఓటు హక్కు రాదు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో <
News January 25, 2026
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్న భారత్.. కానీ

ఇటీవల జపాన్ను దాటి నాలుగో స్థానానికి చేరిన భారత్, 2028లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. అయినా తలసరి ఆదాయం తక్కువగానే ఉంది. దీనికి కారణం 140 కోట్ల మందిపై GDP పంచుకోవాల్సి రావడం. అదే విధంగా దాదాపు 46% మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నా వారి ఆదాయం తక్కువగా ఉంది. 80% పైగా ఉద్యోగాలు సరైన గుర్తింపు లేనివి కాగా కేవలం IT, ఫినాన్స్ వంటి రంగాల్లోనే సంపద కేంద్రీకరణ అయి ఉంది.


