News November 1, 2024
IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి

పాక్ బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ IED బాంబును పేల్చిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మస్తాంగ్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి చౌక్ వద్ద పోలీసు వ్యాన్ టార్గెట్గా ఈ దాడి జరిగింది. ముందుగానే పార్కింగ్ చేసిన బైక్లో బాంబులు ఉంచి రిమోట్ కంట్రోల్తో వాటిని పేల్చినట్టు మస్తాంగ్ DPO ఉమ్రానీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్కూల్ పిల్లలు, ఒక పోలీసు ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు.
Similar News
News February 16, 2026
కొబ్బరి చెట్లకు నీరు ఇలా అందిస్తే మంచిది

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.
News February 16, 2026
ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

<
News February 16, 2026
అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అశుభమా?

దీని గురించి వేద పురాణాల్లో అశుభంగా ఎక్కడా పేర్కొనలేదని పండితులు చెబుతున్నారు. ‘ఈ తిథి పితృదేవతల ఆశీస్సులు గల పవిత్రమైన రోజు. అమావాస్య నాడు పుట్టిన పిల్లలు బలమైన ఆధ్యాత్మికత, తెలివితేటలు, లోతైన ఆలోచనా ధోరణి కలిగి ఉంటారు. ఏవైనా స్వల్ప దోషాలు ఉన్నాయని భావిస్తే శాంతి పూజలు జరిపించుకోవాలి. అలా నివృత్తి చేసుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు వారి కర్మ, పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది కానీ తిథిపై కాదు’ అంటున్నారు.


