News November 1, 2024
Muhurat Trading 2024: లాభాలతో ఆరంభం

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిని లాభాలతో ప్రారంభించాయి. దీపావళి సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ముహూరత్ ట్రేడింగ్లో సెంటిమెంట్ ప్రకారం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 24,304 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్ మొదలుకొని హెల్త్కేర్ వరకు అన్ని రంగాలు గ్రీన్లో ముగిశాయి. IT స్వల్ప నష్టాలు చవిచూసింది.
Similar News
News November 4, 2025
122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News November 4, 2025
మంత్రి అజహరుద్దీన్కు శాఖల కేటాయింపు

TG: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్), మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖను సీఎం రేవంత్ అజహరుద్దీన్కు ఇవ్వలేదు.
News November 4, 2025
రేపు వరల్డ్ కప్ విజేతలకు PM ఆతిథ్యం

ICC ఉమెన్ వరల్డ్ కప్-2025 కైవసం చేసుకున్న భారత క్రికెటర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు(NOV 5న) ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని PMO బీసీసీఐకి పంపింది. ఈరోజు సాయంత్రం హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో క్రికెటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన పైనల్లో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చిరకాల స్వప్నం వరల్డ్ కప్ను సాధించడం తెలిసిందే.


