News November 2, 2024

గవర్నర్ ప్రతిభా అవార్డులు.. నేటి నుంచి దరఖాస్తులు

image

TG: ఏటా 4 రంగాల ప్రముఖులకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ నిర్ణయించారు. పర్యావరణం, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డులు ఇస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు https://governor.telangana.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. అవార్డు కింద ₹2L, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Similar News

News January 13, 2026

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో కన్ను కోల్పోయిన చిన్నారి!

image

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో ఓ చిన్నారి చూపు కోల్పోయాడు. ఒడిశాలోని టిట్లాగఢ్‌లో అంకేశ్(8) చిప్స్‌ ప్యాకెట్‌లో వచ్చిన టాయ్‌తో ఆడుకుంటూ వంటింట్లోకి వెళ్లాడు. ఆ బొమ్మ స్టవ్‌పై పడి పేలిపోయింది. దీంతో అతడి కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయాడు. గతనెలలో కంధమల్(D)లో చిప్స్ ప్యాకెట్‌లోని టాయ్ మింగి 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. ఇలాంటి టాయ్స్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News January 13, 2026

IT కంపెనీల లాభాలకు గండి.. కారణమిదే

image

కొత్త లేబర్ కోడ్‌ల వల్ల IT కంపెనీల లాభాలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా వేతనంలో బేసిక్ పే 50% ఉండాలనే నిబంధన.. దీనివల్ల PF, గ్రాట్యుటీ ఖర్చులు పెరగడం సంస్థలకు భారంగా మారింది. అలాగే ఏడాదికే గ్రాట్యుటీ చెల్లింపు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం కంపెనీలు భారీగా నిధులను కేటాయించాల్సి వచ్చింది. ఈ అదనపు వ్యయాలే TCS, HCL వంటి కంపెనీల నికర లాభాలను తగ్గించాయి. అయితే ఇది ఈ క్వార్టర్‌కే పరిమితమని నిపుణులు తెలిపారు.

News January 13, 2026

ముంబై టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ముంబైతో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. ఓపెనర్ డివైన్(8) విఫలమవ్వగా మూనీ(33) ఫర్వాలేదనిపించారు. చివర్లో ఫుల్మాలి 15 బంతుల్లో 36 రన్స్ చేయగా, జార్జియా(43) తోడ్పాటునందించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, మాథ్యూస్, కేరీ, అమేలియా తలో వికెట్ తీశారు. MI టార్గెట్ 193.