News November 2, 2024

విజయనగరం ‘స్థానిక’ ఎమ్మెల్సీ స్థానానికి 4న నోటిఫికేషన్

image

AP: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా MLC నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 4న EC నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 11 వరకు నామినేషన్లు స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్‌ 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 1న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందుకూరి రఘురాజు టీడీపీలో చేరడంతో మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో బై ఎలక్షన్ అనివార్యమైంది.

Similar News

News December 31, 2025

25,487 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్‌లో CBT ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే SSC స్పష్టం చేసింది.
వెబ్‌సైట్: ssc.gov.in

News December 31, 2025

2025: తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు

image

2025లో AP, TGలు కీలక సంఘటనలకు వేదికలయ్యాయి.
• మే 2: అమరావతి పునర్నిర్మాణానికి PM మోదీ శంకుస్థాపన
• మే 31: Hydలో మిస్ వరల్డ్ పోటీలు.. థాయిలాండ్ సుందరి విజేత
• జూన్ 21: విశాఖలో 3 లక్షల మందితో యోగా దినోత్సవం
• ఆగస్టు 15: APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ప్రారంభం
• అక్టోబర్ 14: విశాఖలో గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల డేటా సెంటర్ ప్రకటన
• డిసెంబర్ 13: హైదరాబాద్‌లో మెస్సీ సందడి

News December 31, 2025

2025: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

image

*Jan 8: తిరుపతిలో తొక్కిసలాట – ఆరుగురు మృతి
*Feb 22: SLBC టన్నెల్ ప్రమాదం – 8 మంది మృతి
*Apr 30: సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి
*May 18: చార్మినార్‌ సమీపంలో అగ్ని ప్రమాదం-17 మంది మృతి
*June 30: సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు-54 మంది మృతి
*Oct 24: కర్నూలు వద్ద బస్సు దగ్ధం – 19 మంది మృతి
*Nov 1: పలాసలోని ఆలయంలో తొక్కిసలాట-9 మంది మృతి
*Nov 3: చేవెళ్ల బస్సు ప్రమాదం – 19 మంది మృతి