News November 2, 2024
విశాఖ- విజయవాడ మధ్య 16 జనసాధారణ్ రైళ్లు

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం- విజయవాడ మధ్య 16 జన్సాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో పూర్తిగా అన్రిజర్వుడు బోగీలు ఉంటాయి. నవంబర్ 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో వీటిని నడపనున్నారు. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరంలో హాల్టింగ్ ఉంటుంది.
Similar News
News December 29, 2025
రూ.600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.
News December 29, 2025
సాగుకు ఆధునిక యంత్రాల సాయం.. రైతుకు తగ్గిన శ్రమ

గతంలో వరి, ఇతర పంటల సాగులో నారు, విత్తనం దశ నుంచి కోత వరకు మానవ శ్రమ, ఎడ్ల శ్రమ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల కారణంగా పంట నాటే దశ నుంచి కోత వరకు అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా నాగలి, దంతె, గొర్రు వంటి పనిముట్ల వినియోగం బాగా తగ్గింది. పంట నాటే దశ నుంచి కోత వరకు ఆధునిక యంత్రాలు కీలకపాత్ర పోషిస్తూ అన్నదాత శ్రమను తగ్గించి సమయాన్ని ఆదా చేస్తున్నాయి.
News December 29, 2025
Pawar PoliTricks: అబ్బాయ్-బాబాయ్ కలిశారు

మహారాష్ట్రలో ఫ్యామిలీస్ రీయునైట్ అవుతున్నాయి. మొన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల కోసం ఠాక్రే సోదరులు కలిస్తే నిన్న పింప్రీ పీఠానికై పవార్స్ ఒకే పరివార్ అని ప్రకటించుకున్నారు. పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన NCP, బాబాయ్ శరద్ పవార్ NCP (SP)లు కలిసి పోటీ చేస్తాయని అజిత్ పవార్ ప్రకటించారు. 1999-2017 వరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ అవిభాజ్య NCP చేతిలో ఉండేది.


