News November 2, 2024

INDvsNZ: రెండో రోజు ఆట ప్రారంభం

image

వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. 86/4 స్కోర్‌తో తొలి రోజు ఆట ముగించిన భారత్ ఇంకా 149 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో గిల్(31), పంత్(1) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 రన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ స్కోర్‌ను సమం చేసి, లీడ్ సాధించాలంటే భారీ భాగస్వామ్యం అవసరం.

Similar News

News November 9, 2025

గుంజీలు తీయడం పనిష్మెంట్ కాదు!

image

గుంజీలు తీయడం అంటే పనిష్మెంట్ అనుకుంటారు. కానీ వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గుంజీలు తీస్తే పొత్తి కడుపు, పేగు కండరాలు బలంగా తయారవుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే వాళ్లు రోజూ 30 గుంజీలు తీస్తే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని కొవ్వు కూడా తేలికగా కరిగి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. SHARE IT.

News November 9, 2025

అనుపమ ఫొటోలు మార్ఫింగ్.. చేసింది ఎవరో తెలిసి షాకైన హీరోయిన్

image

తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయే ఆ పని చేస్తున్నట్లు తెలిసి షాక్ అయినట్లు ఆమె తెలిపారు. ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫ్‌డ్ ఫొటోలు, అసభ్యకర కంటెంట్‌తో తన ఇమేజ్‌ను దెబ్బతీసిందన్నారు. సదరు అమ్మాయిపై లీగల్ చర్యలకు సిద్ధమైనట్లు అనుపమ చెప్పారు.

News November 9, 2025

ఈ వైరస్‌తో బెండ పంటకు తీవ్ర నష్టం

image

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.