News November 2, 2024
తిరుమలను వక్ఫ్ బోర్డుతో ఎలా పోలుస్తారు?: విష్ణువర్ధన్ రెడ్డి

MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<14510629>>వ్యాఖ్యలపై<<>> AP BJP నేత విష్ణువర్ధన్రెడ్డి స్పందించారు. ‘మీరు హిందువుల అత్యంత పవిత్రమైన స్థలాన్ని కొన్ని కమ్యూనిటీ సెంటర్ల(వక్ఫ్ బోర్డు)తో పోల్చుతున్నారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో హిందువులు అడుగు పెట్టలేరు. మరి మీరు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా? మీరు నిజంగా బాలాజీని విశ్వసిస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 8, 2026
వెనిజులా ఆయిల్ ఎగుమతులను మేమే కంట్రోల్ చేస్తాం: అమెరికా

వెనిజులా క్రూడాయిల్ ఎగుమతులను తామే నియంత్రిస్తామని అమెరికా తెలిపింది. చమురు అమ్మకంతో వచ్చే ఆదాయాన్ని US అకౌంట్లలోనే ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ పేర్కొన్నారు. ముందుగా స్టోరేజ్లో ఉన్న ఆయిల్ను విక్రయిస్తామని చెప్పారు. 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను తమకు వెనిజులా అందజేస్తుందని నిన్న ట్రంప్ ప్రకటించారు. కాగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు మదురోను US <<18751661>>అరెస్టు<<>> చేయడం తెలిసిందే.
News January 8, 2026
మొక్కజొన్నలో భాస్వరం లోపం నివారణ ఎలా?

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.
News January 8, 2026
నీరసంగా ఉందా? ఈ ఫుడ్స్ తినండి

నీరసంగా ఉన్నప్పుడు తక్షణశక్తి కోసం కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. గుడ్లు, గింజలు, చీజ్, లీన్ మీట్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్లుండే పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా, అన్నం, నట్స్, ఫిష్, అవకాడో, బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్, టోఫు వంటివి తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుందని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి తినకూడదని చెబుతున్నారు.


