News November 2, 2024
ధోనీ రికార్డును పంత్ అధిగమిస్తాడా?

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ వికెట్ కీపర్లలో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన రెండో బ్యాటర్గా నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీ 39 సార్లు 50+ రన్స్ బాది ప్రథమ స్థానంలో ఉండగా పంత్ 19 అర్ధ సెంచరీలు చేశారు. మూడు, నాలుగు స్థానాల్లో ఫారుఖ్ ఇంజినీర్ (18), సయ్యద్ కిర్మాణి (14) ఉన్నారు.
Similar News
News January 14, 2026
అమెరికాలో 51వ రాష్ట్రం అవ్వనున్న గ్రీన్లాండ్!

డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును US కాంగ్రెస్లో రిపబ్లికన్ మెంబర్ ర్యాండీ ఫైన్ ప్రవేశపెట్టారు. ‘గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్’ బిల్లు ఆమోదం పొందితే, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకునే అధికారం ట్రంప్కు లభిస్తుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్లాండ్ను బలవంతంగా అయినా దక్కించుకుంటామని <<18784880>>ట్రంప్<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.
News January 14, 2026
సంక్రాంతి పురుషుడి గురించి తెలుసా?

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో గోచరించే రూపమే ‘సంక్రాంతి పురుషుడు’. ప్రతి ఏడాది ఆయన ఓ ప్రత్యేక వాహనంపై, విభిన్న వస్త్రాలు, ఆభరణాలతో వస్తాడని పంచాంగం చెబుతుంది. ఆయన ధరించే వస్తువులు, చేసే పనులను బట్టి ఆ ఏడాది దేశంలో వర్షాలు, పంటలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో జ్యోతిషులు అంచనా వేస్తారు. సంక్రాంతి పురుషుడి ఆగమనం ప్రకృతిలో వచ్చే మార్పులకు, భవిష్యత్తుకు సూచికగా భావిస్తారు.
News January 14, 2026
నేడు రెండో వన్డే.. సిరీస్పై టీమ్ ఇండియా గురి

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జరగనుంది. 3 ODIల సిరీస్లో ఇప్పటికే ఒకటి టీమ్ ఇండియా గెలవగా రెండోది కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్లో అదరగొట్టారు. ఇక కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు. అదే విధంగా బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ మనదే అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి JioHotstar, Star Sportsలో వస్తుంది.


