News November 2, 2024

అమ్మవారి వెండి కాయిన్స్ పంపిణీ.. భారీగా తరలివస్తున్న భక్తులు

image

TG: ఏటా దీపావళి పండుగకు HYDలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ఈ నాణేలను తయారు చేస్తారు. ఈసారి గురువారం ప్రారంభమైన కాయిన్స్ పంపిణీ రేపటి(ఆదివారం) వరకూ కొనసాగనుంది. ఈ నాణేలు లభిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. రేపు సెలవు కావడంతో భక్తులు భారీగా వచ్చే అవకాశముంది.

Similar News

News December 31, 2025

APPLY NOW: CDFDలో ఉద్యోగాలు

image

HYDలోని BRIC-సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD)లో 2సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 18వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 27వరకు పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి MSc, MTech, ఎండీ, MVSc, M.Pham, M.Biotech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdfd.org.in/

News December 31, 2025

శివలింగం ధ్వంసం చేసింది హిందువే: SP

image

AP: ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఈ పని చేసింది తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆలయ సిబ్బందితో అతనికి డ్రైనేజీ విషయంలో గొడవలయ్యాయి. వారిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశాడు. నిందితుడు క్రిస్టియన్ కాదు హిందువే. అతని ఒంటిపై టాటూలు కూడా ఉన్నాయి. అతను వాడిన వస్తువులు, స్కూటీ, దుస్తులు సీజ్ చేశాం’ అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.

News December 31, 2025

రాజస్థాన్‌లో 150KGల అమ్మోనియం నైట్రేట్ సీజ్.. ఇద్దరు అరెస్ట్

image

న్యూఇయర్‌ సంబరాలకు రెడీ అవుతున్న వేళ రాజస్థాన్‌లో భారీగా అమ్మోనియం నైట్రేట్, పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. డిస్ట్రిక్ట్ స్పెషల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో యూరియా మాటున తరలిస్తున్న 150KGల అమ్మోనియం నైట్రేట్‌ను గుర్తించి సీజ్ చేశారు. 200 ఎక్స్‌ప్లోజివ్ బ్యాటరీలు, 1100 మీటర్ల వైర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని DSP తెలిపారు.