News November 3, 2024

HYD: త్వరలో ఫుడ్ సేఫ్టీ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్!

image

HYDలో షవర్మా ఘటనలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు ఎందుకు తీసుకువచ్చి డ్రగ్స్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయాలు కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News March 2, 2026

RR: ప్రజావాణికి 51 ఫిర్యాదులు: కలెక్టర్

image

రంగారెడ్డిలో కలక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయని, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News March 1, 2026

RR: డ్వాక్రా మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

image

హెల్త్ మిషన్-100లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని డ్వాక్రా మహిళలందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయబోతున్నామని DMHO డా.లలితాదేవి అన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 2,25,020 మంది మహిళా సభ్యుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని ఆమె పేర్కొన్నారు.

News February 28, 2026

రంగారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. 2019లో 17ఏళ్ల బాలికను సైదాబాదాద్‌కు చెందిన బ్యాగరి సంతోష్ (26) ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.